AP Weather Today: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.