Andhra Pradesh Rains ఏపీలోని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంపై బంగాళాఖాతంలో ఏర్పడి ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఆదివారం నుంచి వానలు ఊపందుకున్నాయి. రెండు జిల్లాల్లో ఎడతెరిపి లేని వాన పడతుండగా.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి తోడు చలి వాతావరణంతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోవైపు తిరుమలలో కూడా వాతావరణం మారిపోయింది. అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి.. అలాగే చలి ప్రభావం కనిపిస్తోంది.