ఒక్క క్లిక్‌తో ఇంటికే పండ్లు, కూరగాయలు.. రైతు బజార్ ధరలకే.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం..

6 months ago 22
Digi Rythu Bazaar AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్విక్ కామర్స్ సేవలు కూడా ప్రారంభిస్తోంది. స్విగ్గీ, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ తరహాలో పండ్లు , కూరగాయలు డోర్ డెలివరీ చేయనుంది. సమీపంలోని రైతుబజార్లను ఆన్‌లైన్ లోకి తెచ్చింది. మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లను ఎంపిక చేసుకుంటే డోర్ డెలివరీ చేయనున్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే మిగతా రైతు బజార్లకు కూడా విస్తరించనున్నారు.
Read Entire Article