వీకెండ్లో బంధువులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఓ కటుుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. రెస్యూ ఆపరేషన్ చేపట్టి. క్షతగాత్రులను ఓ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పటాన్ చెరు సమీపంలో జరిగింది.