ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో ఈ కేసులు నమోదు కాగా.. తాజాగా రెండు మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్లో ఈ వ్యాధి సోకి చికిత్స పొందుతున్న ఇద్దరు చనిపోయారు. పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం చనిపోయారు. శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.