కాంతార హీరో రిషబ్ శెట్టి పర్సనల్ లైఫ్తో పాటు అతడి ఇల్లు కూడా డిస్కషన్లో నిలుస్తోంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో కుందాపురలో రూ.12 కోట్లతో రిషబ్ శెట్టి ఇల్లు నిర్మించుకున్నాడు. ఇది కేవలం లగ్జరీకే పరిమితం కాకుండా సంప్రదాయం, కళలు, ఆధ్యాత్మిక శక్తికి సజీవ సాక్ష్యం.