Kaleswaram Commission Report: తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతుండగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ నివేదికను శాసనసభలో చర్చించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, ఇతర బ్యారేజ్లలో పగుళ్లు రావడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆరే బాధ్యుడని కమిషన్ తేల్చింది. దీనిపై బిఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.