కొత్త రేషన్ కార్డుల కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తామని తెలిపారు. జూన్ నెలలో ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ అని ఆందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.