ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఇకపై వ్యక్తిగత వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ను విధించాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే ఉన్న లైఫ్ ట్యాక్స్కు అదనం. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఆర్డినెన్స్, వాహన కొనుగోలుదారులపై అదనపు భారం మోపనుంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికే ఈ సెస్ అని ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.