వందల ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవాలు తొలిసారి రాష్ట్ర పండుగగా వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 ఏకాదశరుద్ర ప్రభలను ఒకేచోట కొలువుదీర్చి.. గంగలకుర్రు ప్రభలను యువకులు భుజాలపై మోసుకుని తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ దృశ్యాలను చూడటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేశంలోనే ఏకాదశరుద్రులు ఒకేచోట కొలువుతీరే అరుదైన ఘట్టం ఈ ప్రభల తీర్థం. కాగా, కోనసీమ ప్రభలను ప్రధాని మోదీ కూడా మెచ్చారు. పదో తరగతి పాఠ్యపుస్తకంలోనూ ఈ ఉత్సవం చోటు దక్కించుకుంది.