గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు కోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో సస్పెండ్ సీఐ నాగరాజుతో పాటుగా బాబూరావు, జంగం నాని, సాంబయ్యలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలంటూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు డిస్మి్స్ చేసింది. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమంటూ పిటిషన్లు కొట్టివేసింది.