తెలంగాణ గురుకుల నియామకాల వ్యవహారం హైకోర్టుకు చేరగా.. దీనిపై న్యాయస్థానం కీలక తీర్పు వెలువడింది. నోటిఫికేషన్లో భాగంగా.. మిగిలిన ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం 9 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చాలా వరకు పోస్టులు మిగిలి పోయాయని.. వాటిని తదుపరి అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతూ కోర్టు ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో పిటిషనర్లతో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.