హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం 17 మందిని బలిగొన్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి సూచించారు. పురాతన భవనాలు, వ్యాపార సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడంపై దృష్టి సారించాలన్నారు. షార్ట్ సర్క్యూట్లను నివారించడానికి విద్యుత్ అధికారులకు, ఎలక్ట్రికల్ షాపుల యజమానులకు అవగాహన శిక్షణ ఇవ్వాలని కోరారు.