మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వాళ్లలో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కూడా ఒకరు. 'రిపబ్లిక్', ‘విరూపాక్ష’ వంటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో రూపొందుతున్న పాన్-ఇండియా సినిమా 'సంబరాల ఏటి గట్టు'లో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ప్రారంభం నుంచే మంచి క్రేజ్ నెలకొంది.