చుక్క మురుగు నీరు మూసిలో కలవకుండా.. రూ.4700 కోట్లతో వాటర్ బోర్డ్ సరికొత్త ప్లాన్

11 months ago 20
మూసీనదిలో మురుగునీరు చేరకుండా నివారించడానికి హైదరాబాద్ వాటర్‌బోర్డు ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి గౌరెల్లి వరకు ట్రంక్‌లైన్లు నిర్మించి, మురుగును ఎస్టీపీలకు తరలించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికోసం రూ.4,700 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ చర్యల ద్వారా మూసీనదిలోకి మురుగునీరు చేరకుండా.. స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చూడవచ్చని అంటున్నారు.
Read Entire Article