తెలంగాణలో మహిళా ఐఏఎస్ను కించపరిచేలా కథనాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను అసభ్యంగా పోస్ట్ చేసిన మీడియా సంస్థలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా.. అర్ధరాత్రి పలువురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ఇలా అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు.