జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేసీఆర్ కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్తో వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలను ప్రజలకు గుర్తుచేసి, స్థానిక కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లతో అనుసంధానం పెంచాలని సూచించారు. ఈ ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. గెలుపు బీఆర్ఎస్కు దక్కుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.