మెదక్-రుద్రూర్ నేషనల్ హైవే 765 D విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. 97 కి.మీ మేర నాలుగు వరుసల రహదారి ఇప్పటికే 45 శాతం పూర్తయింది. ప్రమాదకర మలుపులు తొలగిస్తుండటంతో.. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రజలకు సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. జూలై 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ రహదారి అందుబాటులోకి వస్తే వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.