CM Revanth Reddy: సినీ కార్మికులు సన్మానించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినిమాను ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్గా మారుస్తామన్నారు. పరిశ్రమ అభివృద్ధికి మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలు చేసిన కృషిని ఆయన కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలించడంలో వారి పాత్రను గుర్తు చేసుకున్నారు.