TDP BJP Leaders Joined YSRCP: ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మిగనూరు టీడీపీ నేతలు మధు, మల్లికార్జున్, బీజేపీ నేతలు మురహరిరెడ్డి, కిరణ్ కుమార్ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత పీజీ రాంపుల్లయ్య యాదవ్, టీడీపీ కార్పొరేటర్ మోనికా రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ లోక్నాథ్ యాదవ్ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు.