ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివక్ష లేకుండా అన్ని రంగాల్లోనూ వారికి ఉపాధి కల్పించి, మైత్రి క్లినిక్లు ప్రారంభిస్తామన్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్జెండర్లు ఇతరలకు స్ఫూర్తి అని ప్రశంసించారు. మరోవైపు, పంచాయతీ కార్యదర్శుల సమస్యలు, అత్యవసర పనుల బిల్లుల విడుదల, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల విలీనంపై మంత్రి సానుకూలంగా స్పందించారు.