గొల్లపూడి, దుర్గ గుడి ప్రాంత ప్రజలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్తను అందించారు. ఎన్హెచ్ 65 ను ఆరు లేన్లుగా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు కేంద్రమంత్రి నితిన గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనివల్ల గొల్లపూడి నుంచి దుర్గగుడి వరకు ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ విస్తరణ వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు, భక్తులకు నగరంలో ప్రయాణించే వారికి ఊరట లభించనుంది. రోడ్డు మధ్యలో సుందరీకరణ పనులు కూడా చేపట్టనున్నారు.