మెదక్ జిల్లా మీదుగా సికింద్రాబాద్-ముద్ఖేడ్ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. రూ. 1.713 కోట్లతో 230 కి.మీ. మార్గాన్ని విద్యుదీకరించారు. దీంతో డీజిల్ రైళ్ల స్థానంలో విద్యుత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, మెమూ రైళ్లను కామారెడ్డి వరకు నడిపే అవకాశాన్ని కల్పిస్తుంది. ముంబై, తిరుపతి వంటి దూర ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది.