సాంప్రదాయ పంటల కంటే ఉద్యాన పంటల సాగు లాభసాటి అని, రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సూక్ష్మ సేద్యంపై ఎస్సీ, ఎస్టీలకు 100%, బీసీలకు 90% సబ్సిడీ అందుతోంది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందే ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.