ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే రోజులలో క్వాంటం టెక్నాలజీ, ఏఐ, ఏరో స్పేస్, డిఫెన్స్ వంటి రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్న చంద్రబాబు.. ఇందులో భాగంగానే వివిధ పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ఆధ్వర్యంలో ఏపీ ఫస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.