Tirumala Indias First AI ICCC: తిరుమలలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భక్తుల రద్దీని తగ్గించి, దర్శనం సులభతరం చేసేందుకు AI, క్వాంటమ్ అనలిటిక్స్ వంటి సాంకేతికతలను వినియోగిస్తున్నారు. అలిపిరి నుండి తిరుమల వరకు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. భక్తుల భద్రత, సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేస్తుంది. తప్పుడు సమాచారం, సైబర్ దాడులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.