శ్రీవారి సేవకులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు వినిపించింది. శ్రీవారి సేవకులకు మరింత మెరుగ్గా దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి సేవకులతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత మెరుగ్గా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. బోర్డు సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.