తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక లభించింది. విశాఖకు చెందిన వ్యాపారవేత్త.. ఏకంగా రూ.3.86 కోట్లతో బంగారు యజ్ఞోపవీతాన్ని తయారు చేయించి స్వామి వారికి అలంకరించేందుకు తీసుకువచ్చారు. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని.. టీటీడీ అధికారులకు అందించారు. అనంతరం దాతలను అభినందించిన టీటీడీ.. వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు.