తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 బస్ డిపోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనకు ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఓఆర్ఆర్ శివారు ప్రాంతాలతో పాటుగా మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. డిపోలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు కేటాయించాల్సిందిగా ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.