తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మార్పుపై పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఇంచార్జ్ ఎస్. మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం సుమారు పది నెలలు విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త ఇంచార్జ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ముకుల్ వాస్నిక్, శక్తిసింహ్ గోహిల్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అదిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.