హైదరాబాద్ మెట్రో మొదటి దశ 69 కిలోమీటర్ల ప్రాజెక్ట్లో ఎల్ అండ్ టీ నిర్వహణ నుంచి వైదొలిగి.. పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ మధ్య అంగీకారం కుదిరింది. రాష్ట్రం రూ.13,000 కోట్లు అప్పును టేకోవర్ చేయడం.. రూ.2,100 కోట్లు నగదు చెల్లించడం ద్వారా ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించబడిన మెట్రో.. ఇప్పుడు ప్రభుత్వ మేనేజ్మెంట్లోకి వెళ్తోంది.