తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను యూఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. జూన్ 20న నాంపల్లి కోర్టులో విచారణ ఉండగా.. కోర్టుకు హాజరుకాకపోతే ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశం ఉంది. ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలును అమెరికా ముమ్మరం చేసింది.