అక్టోబర్ మొదటి వారం నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దాదాపు 74.99 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం అమ్మకంలో ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.