తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతోందని చెప్పారు.