తెలంగాణ రాష్ట్రంలో రూ. 3,745 కోట్ల పెట్టుబడులతో మూడు భారీ కంపెనీలు నెలకొల్పడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జేఎస్డబ్ల్యూ యూఏవీ, తోషిబా, హిందుస్థాన్ కోకా కోలా కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 1,518 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వ్యవసాయం, విద్యుత్ రంగాలకు ఈ నిర్ణయం ఊతమిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.