తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ

1 year ago 31
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి, సాధారణం కంటే 16 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article