తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఉత్తర భారతదేశంలో మైనస్ డిగ్రీలతో వణికిస్తున్న చలి.. మన రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది. పొగమంచుతో ప్రయాణాలు కష్టమవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల హెచ్చరిస్తున్నారు.