మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని అన్నారు. లేదంటే తాను డైరెక్టుగా సీఎం అవుతానంటూ.. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిలను పరోక్షంగా హెచ్చరించారు. తనకు ఆ సత్తా ఉందని.. పదవి ముఖ్యం కాదంటూనే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అదిష్ఠానాన్ని కోరుతున్నారు.