నారావారిపల్లెలో సీఎం ఇంటి ముందు పురుగుల మందు తాగిన రైతు

7 months ago 25
తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటిముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పండుగకు సొంతూరు వచ్చిన సీఎం చంద్రబాబు.. స్వగ్రామంలోనే ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారి పల్లి నుంచి వినతి పత్రం ఇచ్చేందుకు గోవిందరెడ్డి అనే రైతు ఉదయమే సీఎం ఇంటివద్దకు వచ్చాడు. అర్జీ ఇచ్చిన అనంతరం బయటకొచ్చిన రైతు.. తన సమస్యకు పరిష్కారం లభించలేదని అనుకొని.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన నారావారిపల్లె ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article