తెలంగాణ హైకోర్టు కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. రంగారెడ్డి జిల్లాలోని బుద్వేలులో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బుధవారం నాడు నూతన భవనానికి భూమి పూజ చేశారు. దాదాపు రూ.1,550 కోట్ల వ్యయంతో మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 60 జడ్జిలకు సరిపడా ఈ బిల్డింగ్ను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..