మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు హాజరుకాకపోవడం, గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పోలీసులు ఆయనను బెంగళూరు సమీపంలోని రిసార్ట్లో అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇది కక్షపూరిత అరెస్ట్ అని ఆరోపిస్తున్నారు.