తెలంగాణలో నైనీ బొగ్గు గనుల ఇష్యూ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన ఆయన.. ఏది ఏమైనా తన వల్ల ప్రభుత్వానికి రూ30 వేల కోట్లు మిగిలాయన్నారు. తన ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూసి వాళ్లే బొక్క బోర్లా పడ్డారని వ్యాఖ్యనించారు.