పల్నాడు జిల్లాలో సంక్రాంతి వేళ విషాదం నెలకొంది. పోతవరం వద్ద ఎస్సై కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మార్కాపురం ఎస్సై చౌడయ్య కారు.. బైక్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడిని దండా వీరయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే.