AP 10th Students100 Days Action Plan: పదో తరగతి పిల్లల కోసం ఏపీ సర్కార్ 'వంద రోజుల ప్రణాళిక'తో దూసుకుపోతోంది. 100% ఫలితాల లక్ష్యంతో, సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఆదివారాలు కూడా బడి తెరిచి, ప్రత్యేక తరగతులు, భోజనం అందిస్తూ పిల్లల్ని బడికి రప్పించే పనిలో పడ్డారు. పప్పు, కోడిగుడ్డు కూరతో మెనూ కూడా అదిరింది. పిల్లల హాజరు పెంచడంతో పాటుగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక తరగతుల్ని కూడా నిర్వహిస్తున్నారు.