Pawan Kalyan Blankets For Tribal People: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులకు అండగా నిలిచారు. మక్కువ మండలంలోని ప్రజల అవసరాలు తెలుసుకొని 222 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. గతంలో డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామస్తులకు చెప్పులు, కురిడి గ్రామస్తులకు తన తోటలోని మామిడి పండ్లను పంపారు. గిరిజనుల పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానానికి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అవసరాలను తీర్చడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.