జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు చేసిన దారుణ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ప్రకృతి సౌందర్యం ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు దిగిన ఉగ్రవాదులు 27 మంది అమాయకుల ప్రాణాలు హరించారు. ఈ దాడిని దేశమంతటా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.