తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే.. సుప్రీంకోర్టులో రేపు ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా, ఒక్క రోజు ముందే స్పీకర్ తీర్పు వెలువరించడం గమనార్హం. కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, అధికారికంగా పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేల వాదనతో స్పీకర్ ఏకీభవించారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.