విజయవాడలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం చిన్నాపెద్దా భారీగా తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇక విజయవాడకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా దసరా ఉత్సవాలకు వచ్చే చిన్నారులు తప్పిపోతారనే భయం లేకుండా పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ ఉండే రిస్ట్ బ్యాండ్లు అందుబాటులోకి తెచ్చారు. వీటిని స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు తెలిసేలా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.