ప్రపంచంలోనే పెద్ద కంపెనీలకు సీఈఓలు.. మా పాఠశాల సీనియర్లు: సీవీ ఆనంద్

10 months ago 18
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, పీ&జీలకు సారథ్యం వహిస్తున్న సత్య నాదెళ్ల, శైలేష్ జేజురీకర్‌లకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్‌తో అనుబంధం ఉంది. శైలేష్ పీ&జీకి తొలి భారతీయ సీఈవో కానుండగా.. ఆయన, సత్య నాదెళ్ల HPSలో క్లాస్‌మేట్స్. వీరిద్దరికీ క్రికెట్‌తో బలమైన అనుబంధం ఉందని పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. ఒకే పాఠశాలలో చదివి, ప్రపంచ స్థాయి కంపెనీలకు నాయకత్వం వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
Read Entire Article