ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని పేర్కొనడం పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తాను మాట్లాడిన మాటలు.. బీఆర్ఎస్ నేతలకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. టెక్నాలజీని చట్ట వ్యతిరేక పనులకు ఉపయోగిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు.